January 16, 2026

Tsdreams

INDIAN NEWS NETWORK

టీఆర్ఎస్ కంచుకోట హుజూరాబాద్:సింగిరెడ్డి

కరీంనగర్ జిల్లా, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): టీఆర్ఎస్‌కు హుజురాబాద్ కంచు కోటగా ఉందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గడిచిన 30, 40 ఏళ్లలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రపంచంలో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు గొప్పవని ఆయన ప్రశంసించారు. మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేయడం అంటే మాటలు కాదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాల నుంచి పన్నులు వెళ్లడమే తప్ప, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేది ఏమీ లేదని ఆయన విమర్శించారు. రూ.2 కిలో బియ్యం ఇస్తామంటే ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి చేసిన పేద రాష్ట్రం మనదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఏదో ఒక దానికి కేంద్రం ఒక రూపాయి ఇస్తే, మాదే మొత్తం అని చెప్పుకోవడం దౌర్భాగ్యమన్నారు. ఉద్యమకాలం నుంచి టీఆర్ఎస్‌కు హుజురాబాద్ కంచు కోటగా ఉందని ఆయన అన్నారు. ఈటల రాక ముందే ఇక్కడ టీఆర్ఎస్ బలంగా ఉందన్నారు. రాబోయే తెలంగాణ ఫలితాలకు హుజురాబాద్ వేదిక కాబోతుందని ఆయన జోస్యం పలికారు. వచ్చే ఉప ఎన్నికల్లో ఒక్కరు కూడా తప్పు చేయవద్దన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి పునరుద్ఘటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.