తెలంగాణలో బీజేపీ విజయ దుందుభి
- అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ అభ్యర్థులు ఘనవిజయం
హైదరాబాద్, టీఎస్ డ్రీమ్స్, డిసెంబర్ 03: నాలుగు కోట్ల మంది ఉత్కంఠగా ఎదురుచూసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. ఒకటపాటి మెజార్టీ సాధిస్తుందా? హంగు వస్తుందా? లేక ఏ పార్టీ వస్తుంది అని ప్రజలు చర్చించుకున్నారు. ఇక, ఆదివారం ఉదయం నుంచి ఎన్నికల ఫలితాలు ఎంత రసవత్తరంగా మారాయి. ఎట్టకేలకు బీజేపీ పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు.
నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు వీరే..
గోషామహల్ – రాజాసింగ్, కామారెడ్డి – కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, సిర్పూర్ – పాల్వాయి హరీష్
నిర్మల్ – ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ – పైడి రాకేశ్ రెడ్డి, ముథోల్ -రామారావు పటేల్, నిజామాబాద్ అర్బన్ -ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆదిలాబాద్ -పాయల్ శంకర్ లు గెలుపొందారు.

