January 16, 2026

Tsdreams

INDIAN NEWS NETWORK

నిర్లక్ష్యం వద్దు..అప్రమత్తంగా ఉండాలి


కొత్త‌గా 25,467 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు
గ‌డిచిన 24 గంట‌ల్లో వైర‌స్ వ‌ల్ల 354 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డి

హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): భార‌త్‌లో కరోనా తగ్గుముఖం పడుతుంది. అంతమాత్రాన ప్రజలు నిర్లక్ష్యం వహించవద్దని కేంద్ర ఆరోగ్య‌శాఖ హెచ్చరించింది. థర్డ్ వేవ్ ముంచుకోచ్చేప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొత్త‌గా 25,467 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో వైర‌స్ వ‌ల్ల 354 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. సుమారు 39,486 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. దేశ‌వ్యాప్తంగా యాక్టివ్ క‌రోనా కేసుల సంఖ్య 3,19,551గా ఉంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య 4,35,110గా ఉంది. వ్యాక్సినేష‌న్ రిపోర్ట్‌ను కూడా ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.
ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 58.89 కోట్ల మందికి కోవిడ్ టీకాల‌ను వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.