మళ్లీ ఎన్నికల జాతర
- రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్
- 6 రాష్ట్రాల్లో 13 స్థానాలకు ఎలక్షన్స్
- మార్చి 31న ఎన్నికలు
- కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన

ఢిల్లీ/హైదరాబాద్, టీఎస్ డ్రీమ్స్ : నిన్నటి దాకా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన విషయం తెలిసిందే. ఎల్లుండి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం మరో ఎన్నికలకు రెడీ అయింది. కాగా దేశంలో మళ్లీ ఎన్నికల జాతర మొదలుకానుంది. రాజ్యసభ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. 6 రాష్ట్రాలకు చెందిన 13 రాజ్యసభ స్థానాలకు ఈనెల 31వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది. అసోం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, నాగాలాండ్, త్రిపుర నుంచి రాజ్యసభ సభ్యులు ఏప్రిల్ 2న రిటైర్ కానుండగా, పంజాబ్ నుంచి ఐదుగురు సభ్యులు ఏప్రిల్ 9న పదవీ కాలం పూర్తికానుంది. అలాగే పంజాబ్ నుంచి ఖాళీ కానున్న ఐదు సీట్లలో మూడు సీట్లు ఒక ఎన్నికల్లో, మరో రెండు స్థానాలు మరో ఎన్నికలో పూర్తి చేస్తామని కమిషన్ ప్రకటనలో వెల్లడించింది. ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 14న జారీ చేస్తామని, 31న ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొంది. యథాప్రకారం ఓటింగ్ జరిగిన రోజే సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుందని ఈసీ తెలిపింది. పదవీకాలం ముగుస్తున్న రాజ్యసభ సభ్యులలో ఏకే ఆంటోనీ (కేరళ), ఆనంద్ శర్మ (హిమాచల్ ప్రదేశ్), ప్రతాప్ సింగ్ బజ్వా, నరేష్ గుజ్రాల్ (పంజాబ్) వంటి ప్రముఖులు ఉన్నారు. రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ, రాజ్యసభలో కాంగ్రెస్ డిప్యూటీ మంత్రి ఆనంద్ శర్మ, బజ్వాలు కాంగ్రెస్కు చెందిన వారు కాగా, గుజ్రాల్.. శిరోమణి అకాలీదళ్కు చెందిన వారు. పంజాబ్ నుంచి 5 సీట్లు ఖాళీ అవుతుండగా, కేరళలో 3, అసోంలో 2, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్ 1, త్రిపుర 1 చొప్పున రాజ్యసభ సీటు ఖాళీ కానున్నాయి. మార్చి 21న నోటిఫికేషన్ విడుదల కానుండా… 21 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. మార్చి 24న నామినేషన్ విత్ డ్రాకు గడువు ఉంది. మార్చి 31న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈ నేపథ్యంలోనే త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తుంది.
