వరంగల్ మేయర్గా గుండు సుధారాణి
వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా గుండు సుధారాణి ప్రమాణస్వీకరం చేశారు. డిప్యూటీ మేయర్గా రిజ్వానా షమీమ్ కూడా ప్రమాణం చేశారు. వీరిద్దరి పేర్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి కలిసి ప్రకటించారు.
గుండు సుధారాణి 29వ డివిజన్ నుంచి గెలుపొందగా, రిజ్వానా షమీమ్ 36వ డివిజన్ నుంచి గెలుపొందారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లు ఉండగా, టీఆర్ఎస్ 48, బీజేపీ 10, కాంగ్రెస్ 4, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు.
