January 14, 2026

Tsdreams

INDIAN NEWS NETWORK

తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిస్తాం

  • ఈ విజయం అమరవీరులకు అంకితం

హైదరాబాద్, టీఎస్ డ్రీమ్స్ డిసెంబర్ 03: ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమంలో డిసెంబర్ 3న అగ్నికి ఆహుతైన శ్రీకాంతచారి.. అమరుడైన రోజునే కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. దీంతో ఈ విజయం ఆయనకు అంకితం ఇస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చి శ్రీకాంతాచారికి ఘన నివాళులు అర్పించారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కృతజ్ఞత తెలిపే అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికి కృతజ్ఞతలు ఆయన తెలిపారు.

 

 

రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారం అప్పగించి మాపై మరింత బాధ్యతను పెంచారు.

జోడో యాత్ర ద్వారా తెలంగాణలో రాహుల్ గాంధీ స్ఫూర్తిని నింపారు.

తెలంగాణతో తమది కుటుంబ అనుబంధమని చెప్పి రాహుల్ గాంధీ ప్రజల్లో విశ్వాసం నింపారు.

రాహుల్ గాంధీ అండతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించింది.

ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నాం.

తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిస్తాం..

ప్రభుత్వ నిర్ణయాలపై ప్రతిపక్షాలు హేతుబద్ధంగా వాదించేందుకు కాంగ్రెస్ అవకాశం ఇస్తుంది..

ప్రజల తీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా..

ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి విపక్షాలతోపాటు అందరినీ ఆహ్వానిస్తాం..

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం

ప్రభుత్వంలో సీపీఐ,జనసమితి ఆలోచనలను స్వీకరిస్తాం

కూటమి గెలుపుకు సహకరించినందుకు సీపీఐ, కోదండరాం కి కృతజ్ఞతలు

రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాం.

ప్రజా తీర్పును బీఆరెస్ శిరసావహించాలి..

ప్రభుత్వ ఏర్పాటుకు వారి వైపు నుంచి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం

ప్రజాస్వామ్య పునరుద్ధరణకు బీఆరెస్ సహకరిస్తుందని ఆశిస్తున్నాం.

పరిపాలన ఇక గతంలోలా ఉండబోదు…

సచివాలయ గేట్లు సామాన్యులకు తెరిచే ఉంటాయి

ప్రగతి భవన్ ను డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ భవన్ గా మారుస్తాం

ఇక నుంచి అది ప్రగతి భవన్ కాదు.. ప్రజా భవన్

సామాన్యులకు అందులో ప్రవేశం ఉంటుంది.

కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి టీపీసీసీ రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.