కాంట్రాక్టులు ఇచ్చింది రాక్షసులకని తెలియదా? : రఘునందన్ రావు
హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): ఓట్ల బదలాయింపు కోసమే కాంగ్రెస్ నేతలకు సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ బీ-టీంగా కాంగ్రెస్ పనిచేయబోతోందన్నారు. కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులున్నారన్న ఆ పార్టీ సీనియర్ నేత వీ.హనుమంతరావు మాటలు నిజమయ్యాయన్నారు. లంకలో పుట్టినోళ్లు అందరూ రాక్షసులే అంటూ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు లేవు కాబట్టి.. ఆంధ్రోళ్ల ఓట్లు అవసరం లేదని..మరో సారి సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు రఘునందన్ రావు. రోజా ఇంట్లో భోజనం చేసినప్పుడు రాక్షసులని కేసీఆర్ కు తెలియదా? ప్రగతి భవన్లో అలయ్ బలయ్ ఇచ్చినప్పుడు రాక్షసులని మంత్రి ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కు తెలియదా? ఎన్నికను బట్టి సీమాంధ్రులపై టీఆర్ఎస్ విమర్శలు మారుతుంటాయన్నారు. రాక్షుసులకు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశర్వం కాంట్రాక్టులు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. యువరాజు కేటీఆర్ తన చుట్టూ రాక్షసులను ఎందుకు పెట్టుకున్నారో చెప్పాలన్నారు.
